ఏ దర్శకుడి కథనైనా ఓకే చేయకుండా ఎన్టీఆర్ తాత్సారం చేస్తే వెంటనే ఆ కథని అల్లు అర్జున్ ఎగరేసుకు పోతున్నాడు. ఎన్టీఆర్ ఈ మధ్య క్లాస్ అప్పీల్ వున్న కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అల్లు అర్జున్ మాత్రం మాస్ ఇమేజ్ పెంచుకునే దానిపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా అంటే దర్శకులు సహజంగానే మాస్ కథలు రాసుకుంటారు. అయితే ఆ కథలు చేయాలా వద్దా అని ఎన్టీఆర్ డైలెమాలో వుండగా వాటిని బన్నీ తన్నుకుపోతున్నాడు. లింగుస్వామి ముందుగా ఎన్టీఆర్ చుట్టూనే కథ పట్టుకుని తిరిగాడు. అతడిని ఎన్టీఆర్ ఎంటర్టైన్ చేయలేదు. తర్వాత బన్నీ చుట్టూ తిరిగిన లింగుస్వామికి అక్కడ్నుంచీ గ్రీన్ సిగ్నల్ రాలేదు.
బన్నీ ఎలాగో లింగుస్వామితో చేయడం లేదని, అతనితోనే సినిమా చేద్దామంటూ ఎన్టీఆర్ పావులు కదిపాడు. ఈ సంగతి తెలుసుకోగానే లింగుస్వామితో సినిమా ఘనంగా లాంఛ్ చేసాడు అల్లు అర్జున్. ఎప్పుడు చేసేదీ తేల్చకుండా లింగుస్వామిని లాక్ చేసి పారేసాడు. ఈలోగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన వక్కంతం వంశీ కథని విని అతడికి వెంటనే అవకాశమిచ్చాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథని ఎన్టీఆర్ ఓకే చేయకుండా తిప్పించుకుంటున్నాడు. దీంతో అతడిని కూడా బన్నీ కాంటాక్ట్ చేసినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలా తనని చిత్రంగా వేధిస్తోన్న బన్నీ గురించి ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద కూడా చెప్పుకుంటున్నాడట. తన దగ్గరకి వచ్చే దర్శకుల గురించిన న్యూస్ బయటకి పొక్కకుండా చూసుకోమని పీఆర్ టీమ్కి స్ట్రిక్ట్గా చెప్పాడట.
No comments:
Post a Comment